షర్మిల పోటీతో జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు

Published: Monday June 20, 2022

మధిర రూరల్ 19 జూన్ ప్రజా పాలన ప్రతినిధివైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో జిల్లా రాజకీయ సమీకరణాలు మారబోతున్నా యని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గంలో సంచలన విజయం సాధిస్తారని వారు పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఖమ్మం జిల్లా వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపిందని వారు పేర్కొన్నారు. షర్మిల ఖమ్మం జిల్లాలో పోటీ చేయటం వల్ల ఖమ్మం జిల్లా వైయస్సార్ తెలంగాణ పార్టీ అడ్డాగా మారబోతుందని వారు పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్రను విజయవంతం చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులకు వైయస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు నాయకులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.