*షర్మిల పర్యటనకు తరలి వెళ్లిన వైయస్సార్ టిపి నాయకులు*

Published: Saturday December 17, 2022

మధిర డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం పట్టణంలోని కరుణగిరిలో శుక్రవారం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దెల ప్రసాద రావు నాయకత్వంలో నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండల అధ్యక్షులు వేమిరెడ్డి మల్లారెడ్డి ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి షేక్ మౌలానా వాకా వీరారెడ్డి సామినేని రవి ఆధ్వర్యంలో పలువురు వైయస్సార్ టిపి నాయకులు వివిధ వాహనాల్లో తరలి వెళ్లారు. అనంతరం వైఎస్ఆర్ టిపి రాష్ట్ర పరిశీలకులు తాటి సతీష్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గడిపల్లి కవిత రాష్ట్ర నాయకులు శీలం చెన్నారెడ్డిని కలిసి మధిర నియోజకవర్గంలో వైఎస్ఆర్ టిపి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను గురించి వివరించారు. వైఎస్ షర్మిల సభకు తరలి వెళ్లిన వారిలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మస్తాన్ పాషా పార్టీ ముఖ్య నాయకులు పిల్లి పుల్లయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, రామారావు, అతావుల్లా, తదితరులు ఉన్నారు.