కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Published: Friday February 26, 2021

జగిత్యాల, ఫిబ్రవరి 25 (ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆమె వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత చొప్పదండి జగిత్యాల ఎమ్మెల్యేలు రవిశంకర్ డా.సంజయ్ కుమార్ ఉన్నారు. ఎమ్మెల్సీ కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ చైర్మన్ రాజేశం గౌడ్ స్వర్ణలత కవితను కలవడానికి అధికసంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీపడ్డారు.