చిన్న కొర్రాజుల స్వామి జాతరలో పాల్గొన్న యంపీపి

Published: Saturday May 21, 2022

అశ్వారావుపేట(ప్రజాపాలన ప్రతినిధి)అశ్వారావుపేట మండలపరిధిలోని వేదాంతపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో భాగంగా గురువారం ఉదయం చంద్ర పట్నం, సూర్యపట్నం, మైల  పట్నం అనే కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా యంపీపి జల్లిపల్లి శ్రీ రామ్మూర్తి మాట్లాడుతూ సూర్య,చంద్ర, మైల పట్నంలు అనగా శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామికి స్నానం చేయించడం జరుగుతుందని,మూడు పర్యాయాలు సూర్య,చంద్ర, మైల పట్నాలు పేరుతో ముగ్గు వేసి స్వామి వారిని అందులో కూర్చోబెట్టి బండారు వేసిన నీలతో స్వామి వారికీ పోయడం జరుగుతుందని,అప్పుడు భక్తులు స్వామి వారిని తాకిని చినుకు వారి పై పడితే అదృష్టంగా భావిస్తారని దాని ద్వారా పుణ్యం దక్కతుందని వారి తెలిపారు.ఈ కార్యక్రమంలోసర్పంచ్ శోమిని శివప్రసాద్ , ఎంపీటీసీ కొరసిక రామకృష్ణ, ఉప సర్పంచ్ శ్రీకాళహస్తి,టిఆర్ఎస్ నాయకులు వీర్రాజు,పంచాయతీ కార్యదర్శి యాకుబ్ అలీ,టిఆర్ఎస్ నాయకులు,వేదాంతపురం గ్రామస్తులు,వివిధ గ్రామాల  భక్తులు తదితరులు