మెట్‌పల్లి పట్టణానికి నూతన మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలను మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన రాష్

Published: Friday September 23, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి):
రాష్ట్రంలో నూతనంగా 33 మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  జిల్లాలో ఏర్పాటు చేసే ఈ పాఠశాలను మెట్‌పల్లి పట్టణంలో  ఏర్పాటు చేయవలసిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్, మరియు సంబంధిత మంత్రులను విజ్ఞప్తి చేయగా, గురువారం రోజున మెట్‌పల్లి పట్టణంలో పాఠశాల ఏర్పాటు చేస్తూ  ఉత్తర్వులు  రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పాఠశాల ఏర్పాటు చేసినందుకు కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  కృతజ్ఞతలు తెలిపారు.