మెడికల్ కాలేజి మంజూరు అదృష్టంగా భావించాలి : బోగ శ్రావణి

Published: Wednesday May 19, 2021
జగిత్యాల, మే 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ డా:బోగ శ్రావణి మాట్లాడుతూ జగిత్యాలకు మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ మంజూరు చేయడం అదృష్టంగా భావించాలని అన్నారు. సీఎం కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపి మంత్రులు కొప్పుల ఈశ్వర్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితక్క జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‌‌ మెడికల్ నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు జిల్లా ఆస్పత్రి స్థాయి విస్తీర్ణం పడకలు సదుపాయాలు మరింత పెరుగుతయని విద్యార్థులకు వైద్యం విద్య మరింత అందుబాటులోకి రావడమే కాక జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి సిరిసిల్ల తదితర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయని శ్రావణి పేర్కొన్నారు.