కుమ్మరిపల్లిలో గొర్రెలకు ఉచిత పీపీఆర్ టీకాలు
Published: Tuesday February 09, 2021
వెల్గటూర్, మార్చ్ 08 (ప్రజాపాలన): వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి గ్రామములో వెల్గటూర్ ప్రైమరీ వెటర్నరీ సెంటర్ ఆధ్వర్యంలో 230 గొర్రెలక, 68 మేకలకు సర్పంచ్ కొప్పుల సాగర్ ఆధ్వర్యంలో ఉచిత టీకాల పంపిణీ పశు వైద్య సిబ్బంది సోమవారం నిర్వహించారు. గొర్రెలకు పుర్రె రోగ నివారణ కోసం పి. పి.ఆర్ టీకాలు అవసరమని వారన్నారు. ఈ కార్యక్రమములో ఎల్ ఎస్ ఏ పోచయ్య, మాధవి, వి.ఎ.ఎ. నాగరాజు, ఓ.ఎస్ కుమార్, ఎన్ పోచ మల్లు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: