ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం

Published: Tuesday February 16, 2021
మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: 43వ వార్షిక సమ్మేళనం ది.14-02-2021వ తేదీ ఆదివారం సంఘం అధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ గారి అధ్యక్షతన పాఠశాలలో జరిగినది ప్రతి సంవత్సరం రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం కోవిడ్ కారణంగా ఒక్క రోజుకే పరిమితం చేయబడ. ఈ పాఠశాలలో ఈ సంవత్సరం క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు నూతన భవనము నిర్మాణమునకు 15 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీ తేళ్ళ వెంకటేశ్వర రావు (USA)గారికి, విద్యార్థులకు అవసరమైన భోజనశాల నిర్మాణమునకు 4 లక్షల రూపాయలు విరాళం అందజేసిన పూర్వ విద్యార్థి సంఘానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ పాఠశాలలో పై వసతులు కల్పించుటకు సహకరించిన పాఠశాల హెచ్ఎం శ్రీ నారాయణ, శ్రీ సాదం వెంకటేశ్వర రావు ఉపాధ్యాయులకు సంఘం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో కార్యదర్శి శ్రీ మాధవరపు నాగేశ్వరరావు, బాధ్యులు శ్రీ చేరుపల్లి శ్రీధర్, శ్రీ పుల్ల ఖండం చంద్రశేఖర్, శ్రీ అవ్వా రమణ రావు, శ్రీ మక్కెన నాగేశ్వరరావు లతోపాటు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, టెలిఫోన్ రిటైర్డ్ DE అచ్యుత రామారావు గారు, హైదరాబాదు నుండి విచ్చేసిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బాధ్యులు సినీ కళాకారులు శ్రీ గోవిందరావు, శ్రీ వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.  ఈనాటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయటానికి సహకరించిన శ్రీ బుర్రా లక్ష్మీనారాయణ, శ్రీ గుర్రాల శ్రీనివాస్ రెడ్డి గార్లకు సమావేశం ధన్యవాదములు తెలియజేసి పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, అధ్యక్షులు
 
Attachments are