కరోనా బాధితులకు చికెన్ పంపిణి

Published: Monday June 21, 2021
బోనకల్లు ప్రజా ప్రతినిధి 20వ తేదీ బోనకల్మండల పరిధిలోని రావినూతల గ్రామంలో టియస్ యుటియఫ్ జిల్లా  ఉపాధ్యక్షులు సిహెచ్ సుభాషిణి ఇచ్చిన సహకారంతో 35 మంది కరోనా బాధితులకు ఆదివారం నాడు చికెన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు దొండపాటి నాగేశ్వరరావు, టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు. రామకృష్ణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రావినూతల గ్రామంలోని కరోనా బాధితులకు బాసటగా నిలుస్తున్న దాతలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వ్యాక్సినేషన్  ప్రక్రియను వేగవంతం చేసి ప్రజల్లో మనోధైర్యం కల్పించాలని కరోనా మూడోవ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ బోయినపల్లి. కొండ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు. పంతులు, సిఐటియు మండల కన్వీనర్ గుగులోతు. నరేష్, వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ నాయకులు బాణోతు.గోపి ఎర్ర గాని నాగరాజు, మందా వీరభద్రం, జోయిన బోయిన. గురవయ్య, గుండగాని. వాసుదేవ్, గిరిజన సంఘం నాయకులు బాణోతు.నాగేశ్వరావు, బానోత్ మాన్య నాయక్, బానోతు సరి రాములు, గుగులోతు.సైదులు,  బానోతు కృష్ణ, భానోత్ సేవ్య, డివైఎఫ్ఐ నాయకులు గగుగులోతు.సాయి, గుగులోతు.గణేష్,  ధరావతు. జగన్, లావడ్య. పవన్ తదితరులు పాల్గొన్నారు.