తూటి కుంట్ల గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించిన ఎంపీడీవో వేణుమాధవ్

Published: Saturday September 24, 2022

బోనకల్ ,సెప్టెంబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని శుక్రవారం తూటికుంట్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టువంటి నర్సరీని శుక్రవారం ఎంపీడీవో బోడిపూడి వేణుమాధవ్ సందర్శించారు. నర్సరీలో పెంచుతున్న అటువంటి పలు రకాల పండ్ల మొక్కలు చాలా బాగున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. వన సంరక్షణ సంరక్షకుడు నర్సరీ లో ఉన్నటువంటి మొక్కల పెంపకం లో బాధ్యతాయుతంగా చేయటం వలన నర్సరీ బాగుందని వన సంరక్షకుడు తాటికొండ బ్రహ్మచారి నీ అభినందించారు. అదే విధంగా గ్రామంలో జరిగిన ఇటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సందర్శించి గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్నటువంటి సర్పంచ్ నోముల వెంకట నరసమ్మను అభినందించారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, సెక్రెటరీ తాళ్లూరి గోపి, వార్డ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.