బీఎస్పీ ఆధ్వర్యంలో చైత్ర హత్యకు నిరసనగా : అంబేద్కర్ చౌరస్తాలో ర్యాలీ

Published: Thursday September 16, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 15, ప్రజాపాలన ప్రతినిధి : బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షులు గ్యార మల్లేష్  ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్, రాష్ట్ర కో ఆర్డినేటర్, డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గార్ల ఆదేశాల మేరకు సైదాబాద్, సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారి చైత్రని అతి కిరాతకంగా అత్యాచారం, హత్య చేసిన నిందుతుణ్ణి బహిరంగంగా ఉరి శిక్ష విధించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కమిటీ తరుపున డిమాండ్ చేస్తూ బుధవారం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి ర్యాలీగా బయలుదేరి నిందుతుణ్ణి బహిరంగంగా ఉరి తీయాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిఎస్ పి నియోజకవర్గ అధ్యక్షుడు గ్యార మల్లేష్ మాట్లాడుతూ సమాజం ఎటు పోతుందో అర్థం అవడం లేదని, చిన్నారులకు యువతులకు, మహిళలకు రక్షణ కరువైందని ఎన్ని అత్యాచార సంఘటనలు పెరుగుతున్నాయని మహిళలు ఒంటరిగా రోడ్డు పైకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు అనే తేడా లేకుండా ఎవరికీ రక్షణ లేకుండా పోతుందని, మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా రేపిస్టులను ఎన్ కౌంటర్ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు అత్యాచారాలు ఆడపిల్లల తల్లిదండ్రులను  ఆందోళనకు గురి చేస్తున్నాయని మహిళల భద్రత  ప్రశ్నార్థకంగా మారిందని, వరంగల్ లో నాయి బ్రాహ్మణ చిన్నారి శ్రీహిత అత్యాచారం హత్య మరవకముందే మరో ఘటన చూడవలసి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం నిద్రమత్తు వీడి నిందితుడిని ఎక్కడ ఉన్నా పసిగట్టి పట్టుకుని బహిరంగంగా ఉరితీయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధార యాదగిరి, ప్రధాన కార్యదర్శి కొండ్రు కరుణాకర్, కోశాధికారి కంబాలపల్లి శాంత, యాచారం మండల కన్వీనర్ గోరటి కుమార్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వద్ధిగళ్ళ బాబు, యడవల్లి శ్యామ్, రవి, రాజు, ఎర్ర ఇబ్రహీం, కొండ్రు రఘుపతి, మేడిపల్లి మహేష్, ముప్పిడి సురేష్, మేతరి కుమార్, మహేష్ మహారాజ్, గ్యార కిరీటి, యాంజల ప్రహ్లాద్, జోగు అంజయ్య, చిత్రం కృష్ణ, నెమలి సత్యం, సుజాత, యాచారం శ్రీనివాస్, శేఖర్ మహేష్, రవి కుమార్, పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నాయకులు పాల్గొన్నారు.