తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచితగా 14000 మాస్కులు పంపిణీ

Published: Monday May 03, 2021
బాలపూర్ :(ప్రతినిధి) ప్రజాపాలన : పారిశుద్ధ్య కార్మికులకు కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాస్కులు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వారి చేతుల మీదగా అందజేశారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్నటువంటి జిల్లెల గూడ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత మాస్కులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ హాజరై, అనంతరం ఆయన మాట్లాడుతూ..... కరోనా మహమ్మారి వైరస్ విలయ తాండవం చేస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది, ప్రజలకు చేస్తున్న సేవ మాటల్లో చెప్పలేనిది అని కొనియాడారు. ఈ సేవలో పారిశుద్ధ కార్మికులు పొద్దున్నుంచి రాత్రి వరకు పరిసరాల పరిశుభ్రత పనిలో ఉన్న వారికి వారు వారి కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండాలని మాస్కులు ఇస్తూ వారికి జాగ్రత్తలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఫ్లోర్ లీడర్ జెడ్ పి టి సి జంగారెడ్డి, షాద్నగర్ శంకర్, పిసిసి సెక్రెటరీ జానకిరామ్, మీర్ పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి, మాడుగుల మండల అధ్యక్షులు కిషన్ రెడ్డి, కడ్తాల అధ్యక్షులు నరసింహ్మ ముదిరాజ్,యాచారం అధ్యక్షులు నరసింహ్మ, అబ్దుల్లాపూర్మెట్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, చౌదరిగూడ అధ్యక్షుడు రాజేందర్, చౌదరిగుడా ఎంపీపీ, తుక్కుగుడా మున్సిపల్ అధ్యక్షులు జంపన్న యాదవ్ మాజీ ఎంపిటిసి నిమ్మల వెంకటేష్ గౌడ్ మీర్ పేట కార్పొరేటర్లు చల్ల బాల్ రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, బడంగ్ పేట కార్పొరేటర్లు బాలు నాయక్, జై హింద్, నరేందర్ మనోహర్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితరాజు భాస్కర్, కార్తీక్ రెడ్డి, అల శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు పరుశురాం బంకలి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.