సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవం
Published: Thursday May 13, 2021
మేడిపల్లి, మే12 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 15వ డివిజన్ విహరిక కాలనీలో మున్సిపల్ జెనరల్ ఫండ్ అంచనా విలువ రూ 20.00లక్షల వ్యయంతో స్థానిక కార్పొరేటర్ బండారు మంజుల రవీందర్ తో కలిసి నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కే.సుభాష్ నాయక్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు సుమిత్, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: