వరంగల్ విజయ గర్జన సభను విజయవంతం చేయండి- ఎమ్మెల్యే సంజయ్

Published: Monday November 01, 2021

జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) : నవంబర్ 15న వరంగల్ లో తెరాస పార్టీ పాలనలో సాధించిన విజయాలపై నిర్వహించే విజయ గర్జన సభ ఏర్పాట్లలో భాగంగా సన్నాహక సమావేశం పద్మనాయక కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన పట్టణ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ హాజరై దిశానిర్దేశం చేసినారు. అనంతరం కార్యకర్తలతో కలిసి భోజనం చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్, మైనార్టీ విభాగం పార్టీ అధ్యక్షుడు అబ్దుల ఖాదర్ ముజాహిద్, యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి, మహిళ అధ్యక్షురాలు కచ్చు లత, బిసి కమిటీ లవంగా రాజేందర్, రైతు విభాగం బండారి నరేందర్, సోషల్ మీడియా పట్టణ కన్వీనర్ అలిశెట్టి వేణు, కార్మిక విభాగం తొలిప్రేమ శ్రీనివాస్, ఎస్టీ విభాగం శ్రీరామ్ భిక్షపతి, ఎస్సి విభాగం పవన్, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.