రంజాన్ తోఫాను పంపిణీ చేసిన కార్పోరేటర్ సుభాష్ నాయక్

Published: Wednesday April 27, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందించేే రంజాన్ కానుకలను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ డాక్టర్ సుభాష్ నాయక్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ఆదేశానుసారం ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ తోఫాను పంపిణీ చేశారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కార్పొరేటర్ సుభాష్ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షులు పి.బాలరాజ్, కార్యదర్శి. వి.శ్రీనివాస్, బి.మల్లేష్, ఝాంగీర్, ఎండి ఖాన్, కాలనీ వాసులు పాల్గొన్నారు.