చెరువు కట్ట పై రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవం

Published: Thursday May 27, 2021
మేడిపల్లి, మే 26 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ పర్వతాపురం (పోచమ్మ కుంట) చెరువు కట్ట పై రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరల్ ఫండ్స్తో అంచనా 37 లక్షల వ్యయంతో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బొడిగే స్వాతి కృష్ణ గౌడ్ తో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ డి ఈ శ్రీనివాస్, నాయకులు బొడిగే కృష్ణా గౌడ్, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.