ఆవు తోక నరికిన గుర్తుతెలియని దుండగులు
Published: Wednesday September 28, 2022
బోనకల్, సెప్టెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి: ఆవును పెంచి పోషించి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకుంటూ హిందువుల ఆరాధ్య దైవంగా పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం ఆవు చేస్తున్న మేలును మరిచి కొందరు దుండగులు పైశాచిక ఆనందంతో 8 నెలల ఆవు దూడ తోకను గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి అమానుష చర్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని రావినూతల గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధిత యజమాని తాళ్లూరి అనిల్ తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తమ ఇంటి ఆవరణలోని పశువుల షెడ్ లో కట్టివేసిన 8 నెలల ఆవు దూడ తోకను పూర్తిగా గొడ్డలితో నరికి వేశారని బాధితుడు రైతు వాపోయాడు. ఈ సంఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి మూగజీవాలపై అమానుష చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Share this on your social network: