సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా మణి రామ్ సింగ్.

Published: Monday February 22, 2021

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, పిబ్రవరి21, ప్రజాపాలన: టి ఎన్ టి యు సి అనుబంధ సంఘం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షుడిగా మణి రామ్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం బెల్లంపల్లి టిఎన్టియుసి కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ ఇంచార్జ్ బి. సంజయ్ ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మణి రామ్ సింగ్ నాయకత్వంలో టి ఎన్ టి యు సి బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు . బెల్లంపల్లి లో జరుగుతున్న భూ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరించడమేమిటని ఆయన మండిపడ్డారు .. న్యాయవాదుల హత్యపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో భూ దందాలు పెట్రేగి పోయాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో లో మహిళ రాష్ట్ర కార్యదర్శి ఎండి షరీఫా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వాసాల సాగర్, కార్యదర్శి బైర్రాజు శ్రీనివాస్,. నెన్నెలా మండల అధ్యక్షుడు గణేష్ సింగ్, భీమిని మండల అధ్యక్షుడు జాఫర్ ఖాన్, నాయకులు  మద్దెల రాజనర్సు, బొల్లు మల్లయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.