బి కె గూడ పార్క్ వద్ద వృధాగా పోతున్న మంచినీరు పట్టించుకోని అధికారులు... అమీర్ పేట్ (ప్రజాపాలన

Published: Saturday October 08, 2022
అసలే వర్షాకాలం వర్షపు నీటితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మంచి నీరు వృధాగా పోతున్నా ఏ ఒక్క అధికారి ఇటువైపు చూడకపోవడం విచిత్రం. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట్ లోని బి కె గూడ పార్క్ చౌరస్తా వద్ద శుక్రవారం కొన్ని గంటలపాటు మంచి నీరు వృధాగా పోతున్నా ఏ అధికారి పట్టించుకోలేదు. ఐతే ఈ స్థలం బి కె గూడ వార్డు ఆఫీసుకు రెండు, మూడు అడుగుల దూరం లోనే ఉన్నా ఎవ్వరు పట్టించుకున్న దాఖలాలు లేవని, ఆఫీసు ముందే నీరు వృధాగ పోతుంటే పట్టించుకోని వారు ఇక వీధుల్లో ఇటువంటి సమస్యలు తలెత్తితే ఎంతలా చర్యలు తీసుకుంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు.మంచి నీటి లో మురుగు నీరు ఒకవేళ కలిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.