రామయ్యకు నివాళులర్పించిన సర్పంచ్ మోహన్ రావు..
Published: Friday September 16, 2022
తల్లాడ, సెప్టెంబర్ 17 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని గోపాలపేట గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సానుభూతిపరుడు దుగ్గిదేవర రామయ్య(62) గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, టిఆర్ఎస్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు (కేవీ), సీపీఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు, గుంటుపల్లి వెంకటయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, తెదేపా మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని వ్యక్తం చేశారు. మృతునికి భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నివాళులర్పించిన వారిలో నాయకులు పేరసాని వెంకటయ్య, ఉపసర్పంచ్ చల్లగుండ్ల కృష్ణ, సుంకర కృష్ణయ్య, కొమ్మూరు గోపాలరావు, సుంకర నాగేశ్వరరావు, సుంకర వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
Share this on your social network: