బోడుప్పల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : మంత్రి చామకూర మల్లారెడ్డి
Published: Monday September 27, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ కార్పొరేషన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బోడుప్పల్ నగర పాలక సంస్థ 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నర్సింహా ఆధ్వర్యంలో శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీ 5,6 లైన్ మరియు శ్రీ సాయి ఎంక్లేవ్ ఫేస్-3 వెస్ట్ మారుతీ నగర్ కాలనీలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ, స్థానిక కార్పొరేటర్ చీరాల నరసింహతో కలిసి మంత్రి మల్లారెడ్డి రూ50 లక్షలతో కొత్త డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్ భూక్య సుమన్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్, మీసాల కృష్ణ, రాములు, శ్రీ సాయి ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షులు అంజయ్య, జనరల్ సెక్రటరీ కృష్ణమూర్తి, పెంట రెడ్డి కాలనీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కనకయ్య, వెస్ట్ మారుతీ నగర్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్, జనరల్ సెక్రటరీ యాదగిరి, 28వ డివిజన్ అధ్యక్షులు చిన్నిగల్ల సంతోష్, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, మహిళా అధ్యక్షురాలు భార్గవి, జెనరల్ సెక్రటరీ లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: