10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
Published: Wednesday June 16, 2021
మేడిపల్లి, జూన్15 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 16వ డివిజన్ విష్ణుపురి కాలనీలో మున్సిపల్ జనరల్ ఫండ్ అంచనా రూ. 10.00లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ తో కలిసి నగర మేయర్ జక్క వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ఈ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, బండి సతీష్ గౌడ్, కాలనీ వాసులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: