నీలం శ్రీనివాస్ రావుని పరామర్శించిన సిపిఎం నాయకులు. మధిర రూరల్ డిసెంబర్ 30 ప్రజా పాలన ప్రతిని

Published: Saturday December 31, 2022

మున్సిపాలిటీ పరిధిలో శుక్రవాారం నాడు సిపిఎం నాయకులువ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసముందల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్లిన నీలం  శ్రీనివాస్ రావు  బహిరంగ సభ అనంతరం తిరిగి మధిర వచ్చి తన స్వగ్రామమైన మడుపల్లికి కి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన నీలం శ్రీనివాసరావును సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు  పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు శీలం  నరసింహారావు, పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి, ఖమ్మం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించారు, ఈ సందర్భంగా నీలం శ్రీనివాసరావు కు సరైన వైద్యం అందేటట్లు ప్రభుత్వ వైద్యల తో మాట్లాడతామని  కుటుంబ సభ్యులు తాను ఆందోళన చెందవద్దని తెలిపారు.