యాదాద్రి ఆలయానికి రూ19.03 లక్షల విరాళాలు అందజేసిన మేయర్ జక్కా వెంకట్ రెడ్డి కార్పొరేటర్లు నాయ

Published: Friday October 29, 2021
మేడిపల్లి, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు యాదాద్రి శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం నిమిత్తం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల నుండి సేకరించిన దాదాపు రూ 19.03లక్షల పై చిలుకు నగదు మొత్తాన్ని పీర్జాదిగూడ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి యాదాద్రి క్షేత్రం శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి సన్నిధికి చేరుకొని ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, కొల్తూరు మహేష్, బచ్చ రాజు, మద్ది యుగేందర్ రెడ్డి, అమర్ సింగ్, కౌడే పోచయ్య, పిట్టల మల్లేష్, భీంరెడ్డి నవీన్ రెడ్డి, ఎన్. మధుసూదన్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి హరిశంకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, పార్టీ నాయకులు పప్పుల అంజి రెడ్డి, మాడుగుల చంద్రా రెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, యాసారం మహేష్, బొడిగే కృష్ణా గౌడ్, లేతాకుల రఘుపతి రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బండారు రవీందర్, బండి సతీష్ గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్, అలువాల దేవేందర్ గౌడ్, చెరుకు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.