అభివృద్దికి ప్రతిపక్షాలే అడ్డంకులు : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Friday December 17, 2021

జగిత్యాల, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతు ప్రగతి నిరోధకులుగా మారిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి రెచ్చగొట్టడం తప్ప అభివృద్ది తెలియదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల మహబూబ్ నగర్ కరీంనగర్ ప్రాంతాల్లో రోడ్డు వెడల్పులో భాగంగా వీధి వ్యాపారులకు ఇబ్బందుల్లేకుండ చేశారని అదే తరహాలో జగిత్యాలలో నిర్మాణాలు చేపడుతుంటే వీధి వ్యాపారులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం వీధి వ్యాపారులను బలి చేయటం తగదని పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ మాత్రం ఆలోచన చేయకుండ ప్రగతిని అడ్డుకోవటం సరికాదని మండిపడ్డారు. వీధి వ్యాపారులకు సంబంధించి ప్రతి సమాచారం వీడియో ఫోటోలతో సహా తమ వద్ద సమాచారం ఉందని ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వమే ఆరవై వేలతో వీధి వ్యాపారులకు షటర్స్ నిర్మిస్తున్నామని రాజకీయం కోసం విధ్వేషాలు రెచ్చగొట్టే వారి మాటలు నమ్మి గోసపడొద్దని పేర్కొన్నారు. ధర్నాలు చేసే బీజేపీ నాయకులు జిల్లాకు ఒక్క నవోదయ కళాశాల గాని ఒక్క మెడికల్ కళాశాల గాని తీసుకురావాలని సవాల్ విసిరారు. జగిత్యాల మునిసిపాలిటి కాంగ్రెస్ హాయంలో అక్రమ నిర్మాణాల సంగతేంటో ప్రజలందరికి తెలుసని ఎద్దేవా చేశారు. అనంతరం ఎమ్మెల్యే వీధి వ్యాపారులతో మాట్లాడుతు రాజకీయంగా ఉసిగొల్పే వారి మాటలు నమ్మి ఇబ్బందులకు గురి కావద్దని రాష్ట్ర ప్రభుత్వం తాను అండగా నిలుస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ఎఎంసీ వైస్ చైర్మన్ మోసిన్ కౌన్సిలర్లు చుక్క నవీన్ అల్లె గంగసాగర్ కప్పల శ్రీకాంత్ క్యాదాసు నవీన్ కో-ఆప్షన్ మెంబర్ రియాజ్ మామ నాయకులు ముఖేష్ కన్నా అలిశెట్టి వేణు మతిన్ కూతురు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.