ఘనంగా ఆర్యవైశ్య కల్యాణ మండప కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

Published: Monday February 22, 2021

మధిర, ఫిబ్రవరి 21, ప్రజాపాలన: మధిరలో ఆర్య వైశ్య కళ్యాణ మండపం కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శ్రీ వాసవి కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.అధ్యక్షులుగా కురువెళ్ల కృష్ణ మరియు ప్రధాన కార్యదర్శిగా నాళ్ల శ్రీనివాసరావు, కోశాధికారిగా వనమా ఝాన్సీ లక్ష్మిని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్, ప్రముఖ వ్యాపారవేత్త పబ్బతి మోహన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ రావు, చెరుకూరి కృష్ణమూర్తి, పసుమర్తి మల్లికార్జున్ రావు, చిన్ని కృష్ణ రావు, రంగా వెంకటేశ్వర్లు, వనమా వేణుగోపాలరావు(సూరి), వనమా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.