రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారు

Published: Monday March 21, 2022
వై ఎస్ ఆర్ సి పి నాయకుడు కాశీ సతీష్
బెల్లంపల్లి, మార్చి 20 ప్రజా పాలన ప్రతినిధి : రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్  పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్చార్జీ కాశీ సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం నాడు స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిళ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజా సమస్యలపై పర్యటన చేస్తుంటే పార్టీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు దాడులు  చేయడం అమానుషమన్నారు. ఈ దాడిలో వైఎస్ఆర్ తెలగాణ పార్టీ నాయకులకు తీవ్ర గాయాలయ్యాయని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ప్రజా పక్షాన పోరాడుతున్న వైఎస్ఆర్ తెంలగాణ పార్టీ పై ఓర్వలేకనే టీఆర్ఎస్ నాయకులు దాడులు చేస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని,  నిరుద్యోగుల, రైతుల కోసం పార్టీ అధ్యక్షులు షర్మిక పోరాటం చేస్తుం దని, దీంతో ప్రజల బలం తోడవుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ను ప్రజలు గద్దె దించుతారని అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా మహిళ నాయకు రాలు కల్పన, బెల్లంపల్లి మహిళ నాయకురాలు దులాసి కవిత, రాజేశ్వరి, మున్నెస్సా, నాయకులు లోచన కుమార్, కవిరాజ్, సుమంత్, దుర్గరాజ్, చక్రపాణి, తదితరులు పాల్గొన్నారు.