సబ్ డివిజన్ ఆఫీసు ప్రాంగణంలో అప్పయ్య సంతాప సభ

Published: Wednesday May 26, 2021

మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 25వ తేదీ మధిర సబ్ డివిజన్ పరిధిలోని ఇల్లెందుల పాడు సబ్ స్టేషన్ లో ఆపరేటర్ (ఆర్టిజన్) గా విధులు నిర్వహిస్తున్న రామాల అప్పయ్య కరొనా వ్యాధితో గత రాత్రి స్వర్గస్తులైనారు. ఈ సంధర్భంగా సబ్ డివిజన్ ఆఫీసు ప్రాంగణంలో పురుషోత్తం గారి ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేసారు. విధి నిర్వాహణ లో విద్యుత్ కార్మికుడు కరోనా సోకి మరణించడం చాలా భాదాకరం అని, అప్పయ్య కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, ప్రతి విద్యుత్ కార్మికుడు ప్రాధమిక కరోనా నియంత్రణ చర్యలు పాటిస్తు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చే విషయములో రాజీ పడకుండా విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో రూరల్ సెక్షన్ నాగేశ్వరరావు, పట్టణ శరత్, వెంకట నరసయ్య మరియు సబ్ డివిజన్ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.