తుర్కయంజాల్ లో జనవరి లో జరిగే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

Published: Friday December 24, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 23 ప్రజాపాలన ప్రతినిధి : తుర్కయంజాల్ లో జరిగే జనవరి 22 25 తేదీల్లో సిపిఎం పార్టీ  రాష్ట్ర  మూడవ మహాసభలను విజయవంతం చేయాలని ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి చేతల జంగయ్య కోరారు తదనంతరం పండు క్యాంపెయిన్ ప్రతి గ్రామాలలో పార్టీ కార్యకర్తలకు పని చెయ్యాలని పిలుపునిచ్చారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మహాసభల నుద్దేశించి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు ప్రచారంలో నిలిచి రాష్ట్ర మహాసభలు బ్రహ్మాండంగా జరిగే విధంగా చూడాలని అని కోరారు రేపు రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సిపిఎం పార్టీనీ పునర్వైభవం తేవడం కోసం ప్రతి పార్టీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎర్ర జెండా మళ్లీ రెపరెపలాడాలి అని వచ్చే ఎన్నికల్లో సిపిఎం పార్టీ ఎమ్మెల్యే కైవసం చేసుకోవడం కోసం పార్టీ కార్యకర్తలు కంకణబద్ధులై పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని కోరుతున్నాను పార్టీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.