ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday November 30, 2022
క్వాలిటీ బేకరీ,ఏ3జిమ్ లను ప్రారంభించిన ఎమ్మెల్యే*

ఇబ్రహీంపట్నం లో వ్యాపారాలను ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. సాగర్ ప్రధాన రహదారిపై ఉన్న క్వాలిటీ బేకరీ, ఏ3 జిమ్ ను సోమవారం లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ చదువుకున్న యువత వ్యాపార రంగంలో కూడా రాణించాలని ఆయన అన్నారు. ప్రతిరోజు వ్యాయామంతో మానసిక ప్రశాంతతతో పాటు  దేహ దారుఢ్యం కూడా పెరుగుతుందని ప్రతి ఒక్కరికి వ్యాయామం అవసరమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, సత్తు వెంకటరమణారెడ్డి, సల్మాన్ ఫరీస్, షఫీ, నజీబ్ మున్నిస్, బాపుట్టి, సల్మాన్, రజాక్, మసుర్ కౌన్సిలర్ నల్లబోల్ శ్రీనివాస్ రెడ్డి,  మంద సుధాకర్, ముత్యాల చిన్న, యాచారం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.