హోమియో హాస్పిటల్ పుతుంబాక ఆర్థిక వితరణ

Published: Monday October 11, 2021
మధిర, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక కుందా సేవాసమితి హోమియో హాస్పిటల్ కు అవసరమయ్యే మందుల నిమిత్తంరంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు శ్రీ పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ మూడు వేల రూపాయల ఆర్థిక వితరణను హోమియో హాస్పిటల్ నిర్వాహకులు డా.కిలారు కామేశ్వరరావు గారికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి దాతల సహకారంతోనే హోమియో హాస్పిటల్ నందు మందులను ఉచితంగా పంపిణీ చేయగలుగుతున్నామని తెలుపుతూ పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రామభక్త సీతయ్య కళాపరిషత్ సెక్రటరీ బాబ్లా, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం చైర్మన్ కపిలవాయి జగన్ మోహన్ రావు, హోమియో హాస్పిటల్ వాలంటీర్లు బొగ్గవరపు హరీష్, సాహిత్య, మేడేపల్లి శ్రీనివాసరావు, కత్తి ప్రభాకర్, జూనియర్ హరీష్ చలువాది గోపికాంత్, షేక్ ఖాసీం, కిలారు భాస్కర్, తాళ్లూరి రిషిత, మేడేపల్లి ప్రణిత, మేడేపల్లి సాయి రోహన్ తదితరులు పాల్గొన్నారు.