ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Published: Wednesday August 11, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని శివసాయి ఫంక్షన్ హాల్ లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు పాశం కృష్ణమూర్తి నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి పాల్గొని సమాజంలో గురువుల గొప్పదనాన్ని గురువు యొక్క బాధ్యత చాలా గొప్పదని కొనియాడారు కస్తూరి ఫౌండేషన్ అధ్యక్షులు కస్తూరి చరణ్ గురు వందనం కార్యక్రమం యొక్క ఆవశ్యకత సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి గొప్పగా ఉండాలని కోరుకున్నా కార్యదర్శి నవత్ సురేష్, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య బందరపు లింగస్వామి, జైని వెంకటేశ్వర్లు పొట్లపల్లి స్వామి పాల్గొని గురు వందనం కార్యక్రమం యొక్క ఆవశ్యకతను ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాల శాలువాతో మెమెంటో తో సత్కరించి గురుపూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వుకుర్తి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి జూల నవీన్, జిల్లా కార్యదర్శులు మై సొల్ల కిరణ్ కుమార్, మన్యం నరేందర్ రెడ్డి, కందుల ఉపేందర్, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.