రక్తదానం చేసిన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సమ్మయ్య

Published: Wednesday January 25, 2023

శంకరపట్నం జనవరి 24 ప్రజాపాలన రిపోర్టర్:


కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లోని శంకరపట్నం మండల జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి జన్మదినo పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో శంకరపట్నం ప్రెస్ క్లబ్ (ఐ జే యూ) అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ దండు సమ్మయ్య రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మానవతావాది సేవా భావం కలిగిన సీనియర్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దండు సమ్మయ్య తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేసినందుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు పల్లె సంజీవరెడ్డి , ఎంపిటిసి ల పోరం మండల అధ్యక్షుడు పెద్ది శ్రీనివాసరెడ్డి, వైస్ ఎంపీపీ పులి కోట రమేష్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, సర్పంచులు రాజయ్య, భద్రయ్య, వెంకటరమణారెడ్డి ,సంపత్, సర్పంచులు, ఎంపిటిసిలు, ఐజేయు జిల్లా ఈసీ మెంబర్ గాజుల స్వామి మండల జర్నలిస్టులు, రవీందర్, అర్జున్ ,సత్యం, నాయకులు అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.