భాస్కర్ల వాసు పై పోలీసు బాసు ప్రశంసలు మంచిర్యాల బ్యూరో, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి

Published: Tuesday June 21, 2022
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన వాసు యాడ్స్ అధినేత భాస్కర్ల వాసు ను
డిజిపి మహేందర్ రెడ్డి ప్రశంసించారు. సోమవారం  రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డిజిపి మహేందర్ రెడ్డి ని వాసు యాడ్స్ ఆధినేత బాస్కర్ల వాసు
మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తను స్వయంగా గీచిన డిజిపి చిత్రపటాన్ని అయనకు బహుకరించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ చిత్ర కళను భావితరాలకు అందించాలని సూచించారు. మీ జ్ఞాపిక నాకు బాగా నచ్చింది అని  ఆయనను ప్రశ్నించారు. చిత్రకారులు తమ కళల ద్వారా  సమాజంలో ప్రత్యేక మైన గుర్తింపు పొంది ప్రజల్లో స్థిరాస్తాయిగా నిలిలుస్తారని అన్నారు.