గ్రామపంచాయతీ కార్యదర్శులకు సమీక్ష నిర్వహించిన ఎంపీడీవో

Published: Friday March 10, 2023
బోనకల్ ,మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో గురువారం ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్ సమీక్షా సమావేశం నిర్వహించి అందరికీ అవసరమైన సూచనలు చేయడం జరిగింది.
కార్మిక సమీకరణ,వేతన రేటు మెరుగుదల,కంపోస్ట్ ఎరువు ఉత్పత్తి, కంపోస్ట్ షెడ్ యొక్క వినియోగం ఇంటి పన్ను వసూలు , రసీదు పుస్తకం యొక్క నమోదు,వేతనాలు కోరేవారి పెండింగ్‌లో ఉన్న ఆధార్ సీడింగ్ మునుపటి సమయంలో పూర్తి చేయడం,ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డి ఎస్ ఆర్ పూర్తి చేయడం అన్ని ఇతర సాధారణ కార్యకలాపాల పై సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని పాఠశాలను ఎంఈఓ , పంచాయతీ కార్యదర్శులు,కాంట్రాక్టర్‌తో ఎం ఓ ఎం బి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రావినూతల, ముష్టికుంట్ల గ్రామపంచాయతీలలో అవెన్యూ ప్లాంటేషన్‌, వాటరింగ్‌ను పరిశీలించడం జరిగింది. అలాగే జానకీపురం గ్రామపంచాయతీలో అవెన్యూ ప్లాంటేషన్‌ వర్క్‌సైట్‌లో సాసర్‌, బుష్‌ క్లియరెన్స్‌ను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.