శిరిడి సాయి నాథ మందిరం లో గురుపౌర్ణమి ఉత్సవ ఏర్పాట్లు పూర్తి

Published: Thursday July 22, 2021

ఇబ్రహీంపట్నం, జులై 21, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణగుట్ట ఖానాపూర్ లో గల ఏకశిలా సాయినాధ మందిరం లో 23, 24, 25 తేదీలలో గురుపౌర్ణమి సందర్భంగా సాయినాధుని దేవాలయం ముస్తాబు చేసి తగిన ఏర్పాట్లను పూర్తి చేశామని దేవాలయ చైర్మన్ మడుపు రమ్య, వేణుగోపాల్ తెలిపారు. మూడు రోజులు జరగబోయే ఉత్సవాలలో జరిగే కార్యక్రమాలు 23వ తేదీ ధ్వజారోహణ, అర్చన, అభిషేకాలు, మధ్యాహ్న హారతి, అన్నదాన కార్యక్రమాలు, అర్చనలు సాయంకాల దర్శనం రాత్రి శేష హారతి అదేవిధంగా 24వ తేదీ శనివారం ఉదయం 6 గంటలకు హారతి అభిషేకం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల వరకు అర్చనలు 26వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ హారతి అభిషేకం అర్చనలు మధ్యాహ్న హారతి అన్నదానం అం సర్వ దర్శనములు రాత్రి భజనలు శేష హారతితో ముగుస్తుందని భక్తులు భారీ ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు చేసి బబావారి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ, అందరినిఆహ్వానిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ మా డుపు వేణుగోపాల్ రావు తెలిపారు