నూతన డిఎస్పి వెంకటేశ్వర బాబుని సత్కరించి అభినందించిన భారత రత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయక

Published: Tuesday June 08, 2021
కరోనా విపత్తులో పోలీసులు అందిస్తున్న 
సేవలు బహు ప్రశంసనీయం !
భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా
అధ్యక్షుడు మద్దెల శివ కుమార్
కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూన్ 7, ప్రజాపాలన ప్రతినిధి : గత సంవత్సర కాలంగా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తూ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పోలీసు అధికారులు పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ కుటుంబాలను సైతం వదిలేసి ఈ లాక్ డౌన్ సమయంలో అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమైన వని చారిత్రాత్మకమైన వని భారతరత్న అంబేడ్కర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దెల శివ కుమార్ ఉద్ఘాటించారు 07 06 2021 నాడు మద్దెల శివ కుమార్ నేతృత్వంలో  సంఘ నాయకులు ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టి ఈ కరోనా కష్టకాలంలో మానవత్వాన్ని చూపుతూ అంకితభావంతో విశిష్ట సేవలందిస్తున్న కొత్తగూడెం డిఎస్పీ శ్రీ వెంకటేశ్వర బాబును వారి కార్యాలయంలో కలిసి కోవిడ్  నిబంధనలను పాటిస్తూ ఘనంగా పూలమాలలతో శాలువాలతో సత్కరించి అభినందించి స్వీట్లు తినిపించారు సిబ్బందికి కూడా స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మద్దెల డిఎస్పి శ్రీ వెంకటేశ్వర బాబు గారితో కొత్తగూడెం లోని లా అండ్ ఆర్డర్ సమస్యలను గురించి చర్చించినారు దళితులపై జరుగుతున్న అరాచకాలు యువత మత్తు పదార్థాలకు బానిసలై కొత్తగూడెం లోని అన్ని ప్రాంతాలలో డ్రగ్స్ ను  తీసుకుంటున్న విషయం ఎక్కువ ప్రాంతాలలో గుడుంబా తయారీ అవుతున్న విషయం ఈవ్ టీజింగ్ రౌడీయిజం తదితర అంశాలను గురించి చర్చించారు అంతేకాకుండా కాలేజీలలో చదువుతున్న యువ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి నైతిక విలువలు పెంపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు డీఎస్పీ శ్రీ వెంకటేశ్వర బాబు స్పందిస్తూ తప్పకుండా ఈ విషయాలన్నిటిపై ధ్యానం ఉంచి తప్పకుండా అరికడతామని హామీ ఇస్తూ అందుకు ప్రజల సహకారం మీలాంటి సామాజిక సంస్థల సహకారం అందించాలని కోరారు ఈ సందర్భంగా కరోనా విపత్తులో చిరస్మరణీయ సేవలు అందిస్తున్న డాక్టర్లకు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బంది కి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. ఈ ఆత్మీయ అభినందన కార్యక్రమంలో మద్దెలతో బాటు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి మందా హనుమంతు ఉపాధ్యక్షులు అంతోటి పాల్ గౌరవ సలహాదారులు కౌన్సిలర్ కోలపూడి ధర్మరాజు పొన్నెకంటి సంజీవ రాజు చంద్రగిరి గోపీచంద్ అర్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు