మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Tuesday October 18, 2022

మధిర అక్టోబర్ 17 (ప్రజా పాలన ప్రతినిధి) ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా 12వ విడత 12 కోట్ల మంది రైతులకు 2000 రూపాయలను సోమవారం కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయటం పట్ల బిజెపి నాయకులు సోమవారం సంబరాలు నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద తమ వంతుగా సహాయం  చేయాలని ఒక మంచి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద రైతుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా  రైతులకు సబ్సిడీ పై ఎరువులు అందిస్తున్న ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరావు పెరుమాళ్ళపల్లి విజయరాజు బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు బీజేపీ జిల్లా అధికారం ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు కొనా నరసింహారావు, సీనియర్ నాయకులు, కొప్పురావూరి రామ యోగేశ్వరావు, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాపట్ల రమేష్ బియ్యవరపు రామకృష్ణ, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు వేంకటేశ్వరావు, బొడ్డు మాధవ్ సాయి, మోహనరావు, శ్రీకాంత్, విల్సన్, మార్కువా, వేణు, మురళి, చందు కార్తీక్, తదితరులు పాల్గొన్నారు,