నేటి తరానికి మార్గదర్శి స్వామి వివేకానంద
Published: Thursday January 13, 2022
మంచిర్యాల బ్యూరో, జనవరి 12, ప్రజాపాలన : యువతరానికి స్ఫూర్తి ప్రదాత, భారతదేశ చరిత్ర ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద జయంతి వేడుకలను జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి దగ్గర కాలేజ్ రోడ్డు వివేకానంద చౌరస్తా వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అజయ్ గౌడ్, సాయి ఠాకూర్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆవుల సాయి, సంజీవ్, విజయ్, సతీష్ బుద్దె మహేష్, ముక్కెర నగేష్, తిప్పని సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: