దళితులను మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

Published: Friday November 18, 2022

మధిర  నవంబర్ 17 (ప్రజా పాలన ప్రతినిధి) ఎన్నికలకు ముందు దళితులకు ఇచ్చిన అనేక హామీలను అమలు చేయకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేస్తుందని బిజెపి దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళపల్లి విజయరాజు ఆరోపించారు. గురువారం నిధానపురం గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో దళిత బస్తి సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన మాట్లాడారు. పల్లెలను అభివృద్ధి చేస్తూ, గ్రామపంచాయతీలకు 90 శాతం నిధులు కేటాయిస్తూ, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడు అని, మూడు ఎకరాల వ్యవసాయ భూమి అని, దళిత బంధువు అని అనేక హామీలతో దళితులను వంచిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, దేవరకొండ కోటేశ్వరరావు, గుండా చంద్రశేఖర్ రెడ్డి, పాపట్ల రమేష్, పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, వేణు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.