ఉప్పల్లో ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 14 (ప్రజాపాలన ప్రతినిధి)

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్132వ జయంతి వేడుకలను ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని

 ఉప్పల్, హబ్సిగూడ చౌరస్తాలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఎమ్మార్వో గౌతం కుమార్ తో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హబ్సిగూడ చౌరస్తాలో స్థానిక కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ చైతన్ హరీష్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఉప్పల్ రింగ్ రోడ్లో బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బండారి వెంకట్రావు, కక్కిరేణి హరీష్, గరిక సుధాకర్, ఆకుల మహేందర్, అన్య బాలకృష్ణ, కుమారస్వామి, రేవు నరసింహ, ఎల్లా చారి తదితరులు పాల్గొన్నారు.