ప్రజల సహకారంతో డివిజన్ అభివృద్ధికి కృషి
Published: Monday July 05, 2021
కార్పొరేటర్ రమ వెంకటేష్ యాదవ్
మేడిపల్లి, జూలై4 (ప్రజాపాలన ప్రతినిధి) : డివిజన్లోని ప్రజల సహకారంతో డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమ వెంకటేష్ యాదవ్ తెలిపారు. డివిజన్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కార్పొరేటర్ రమ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మేయర్ సామల బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో చేయవలసిన పనుల కార్యాచరణ ప్రకటించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల అధ్యక్షులు మరియు సీనియర్ సిటిజన్స్, యువకులు, మేధావులు పాల్గొని డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు గురుంచి తెలియచేసి మరియు డివిజన్ అభివృద్ధి కోసం వారి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు, మునిసిపల్ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: