మహిళలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలిఅడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ

Published: Thursday March 03, 2022
మధిర మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం నాగవరప్పాడు గ్రామాన్ని బుధవారం నాడు మహిళలు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని మధిర అడిషనల్ సిడిపిఓ వీరభద్రమ్మ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నాగవరప్పాడు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ మాలతి అంగన్వాడి టీచర్లు ఉషారాణి, సరిత ఆయాలు అక్కమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు