45 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

Published: Thursday December 15, 2022

జగిత్యాల, డిసెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణ, మండలానికి చెందిన 45 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్దిదారులకు రాయికల్ పట్టణ వర్తక సంఘం లో  ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అందజేసినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ రాష్ట్రం వచ్చిన తర్వాత జగిత్యాల ప్రధాన ఆసుపత్రిని 100 నుండి 220 పడకల ఆసుపత్రి గా మార్చడం జరిగిందని అన్నారు. మంత్రి హరీష్ రావు ని కోరగానే జిల్లా ఆసుపత్రిలో 1 కోటి 80 లక్షల తో సిటీ స్కాన్ ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. 12 కోట్ల తో 50 పడకలతో ట్రామా సెంటర్ క్రిటికల్ హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు కానుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మోర హనుమండ్లు, ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జెడ్పీటీసీ అశ్విని జాదవ్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు కొల శ్రీనివాస్,ఇంతియాజ్, పిఎసిఎస్ ఛైర్మెన్ మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, నాయకులు కిషన్ రావు, నందు నాయక్, హనుమాన్ దేవాలయం ఛైర్మెన్ సత్యనారాయణ, జిల్లా ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు మోర రామ్మూర్తి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.