సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Wednesday June 16, 2021
కోరుట్ల, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైతుబంధు అధ్యక్షులు చీటీ వెంకట్రావు సూచన మేరకు రైతు వేదిక దగ్గర గ్రామ సర్పంచ్ మరియు తెరాస గ్రామ శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాధ సందయ్య ఎంపీటీసీ బోడ గంగాధర్, పిఎసిఎస్ చైర్మన్ సాయిరెడ్డి, ఐలాపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బక్కోలా మైపాల్, టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు కుంటల వికాస్, వీడీసీ అధ్యక్షులు హనుమంతు, రైతులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.