రక్తదాన కార్యక్రమం లో పాల్గొన్న బోనకల్ మండల నాయకులు
Published: Friday October 29, 2021
బోనకల్, అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం శిబిరానికి బోనకల్ మండలం నుంచి పొంగులేటి అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఉమ్మనేని కృష్ణ, మండల నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, కోయినేని ప్రదీప్, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, చింతలచెరువు లక్ష్మీనారాయణ, ఊటుకూరు బాలకృష్ణ, కొరివి సురేష్, ఏలియేలు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: