రక్తదాన కార్యక్రమం లో పాల్గొన్న బోనకల్ మండల నాయకులు

Published: Friday October 29, 2021
బోనకల్, అక్టోబర్ 28 ప్రజాపాలన ప్రతినిధి: ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం శిబిరానికి బోనకల్ మండలం నుంచి పొంగులేటి అభిమానులు, పార్టీ నాయకులు భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు ఉమ్మనేని కృష్ణ, మండల నాయకులు తోటకూర వెంకటేశ్వరరావు, కోయినేని ప్రదీప్, బోయినపల్లి మురళి, గొడుగు కృష్ణ, చింతలచెరువు లక్ష్మీనారాయణ, ఊటుకూరు బాలకృష్ణ, కొరివి సురేష్, ఏలియేలు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.