ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రె

Published: Tuesday November 15, 2022
మేడిపల్లి, నవంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) 
 ఉప్పల్ డివిజన్ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మందముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఉప్పల్ డివిజన్లో రూ.57.5 లక్షలతో పలు
 అభివృద్ధి పనులను సోమవారం ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కార్పొరేటర్ మందముల  రజితపరమేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.శేషసాయినగర్ జిమ్ నుంచి స్వరూప్ నగర్ ఆటో స్టాండ్ వరకు రూ.37.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, పద్మావతి కాలనీలో రూ.15 లక్షలతో  నీటి నిల్వల తొలగింపుకు సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ ,శేషసాయి నగర్ లో రూ 5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  
ఉప్పల్ మున్సిపల్ ఈఈ నాగేందర్,
 డీఈ నిఖిల్ రెడ్డి, ఏఈ వసంత, జలమండలి మేనేజర్ జాన్ షరీఫ్, డీజిఎం రజనీకాంత్ రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, లేతాకుల రఘుపతి రెడ్డి, బన్నల్ల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్,వేముల సంతోష్ రెడ్డి, మస్క సుధాకర్,  స్థానిక కాలనీల వాసులు శ్రీనివాస్, కృష్ణమాచార్యులు, మోదుగు శేఖర్ రెడ్డి  , నర్సయ్య పద్మావతి కాలనీ శేషసాయి నగర్ కాలనీ ,స్వరూప్ నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,బీమా నాయక్  విప్లవ్ రెడ్డి,చారి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.