ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి : కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి

Published: Tuesday July 13, 2021
మేడిపల్లి, జులై 12 (ప్రజాపాలన ప్రతినిధి) : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలనీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజి రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో డివిజన్లోని కెనరానగర్  కాలనీలో ప్రతి ఇంటికి 6 రకాల మొక్కలను పంపిణీ చేశారు. కాలనీ వాసులు ప్రతి మొక్కను బాధ్యతగా నాటి కాపాడి పర్యావరణానికి మేలు చేయాలని కార్పొరేట్ సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు, యువత బాలాజీ, అఖిల్, శాలిమ్, హరీష్, డివిజన్ ఆఫీసర్ వాజిత్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.