రాయపట్నం లో భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం

Published: Wednesday April 20, 2022
మధిర ఏప్రిల్ 19 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో రాయపట్నం గ్రామంలో మంగళవారం నాడు ప్రజాసమస్యల పరిష్కారం కొరకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 25వ రోజు సోమవారం మధిర మండలం రాయపట్నంగ్రామానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలివచ్చి భట్టి విక్రమార్కకి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. డప్పు కళాకారుల బృందం విన్యాసాలు, కోలాటం మహిళల నృత్యాలతో హోరేత్తింది. సబ్బండ వర్గాల ప్రజలు కదిలి వచ్చి భట్టి అడుగులో అడుగులు వేస్తూ పీపుల్స్ మార్చ్ లో కదం తొక్కారు. అడుగడుగునా ప్రజలు భట్టి పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ మిర్యాలరమణ గుప్తా బాలరాజు శీను వెంకట్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేణు నందిని హనుమంతరావు కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు భారీగా పాల్గొన్నారు దిగ్విజయ్ చేశారు