ప్రభుత్వ కళాశాల కు ప్రహరి గోడ మంజూరు చేయాలి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్

Published: Saturday July 16, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై15(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలోని వాంకిడి మండలంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల కు ప్రహరి గోడ మంజూరు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిశెల కార్తీక్ అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ వాంకిడి మండలంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో 300 మంది విద్యార్థులు విద్యను అందిస్తున్నారని, కళాశాల ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కళాశాలకు ప్రహరీగోడ లేకపోవడం బాధాకరమని, దీంతో విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఆటస్థలం కూడా లేదని అన్నారు. వర్షాలు వస్తే కళాశాల ఆవరణలో బురదతో నిండి పోతుందన్నరు. ఇలా అనేక సమస్యలతో కళాశాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు కానీ స్పందించి కళాశాలకు ప్రహరి గోడ, మరుగుదొడ్లు, అలాగే అదనపు భవనం మంజూరు చేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, నిఖిల్,లు పాల్గొన్నారు.